నర్సు ఆపరేషన్.. గర్భిణి మృతి!

17 Nov, 2016 07:50 IST|Sakshi

శ్రీకాకుళం: ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ గర్భిణి మృతిచెందింది. ఈ ఘటన శ్రీకాకుళం రాజాం సెయింటాన్స్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. డెలివరీ కోసం ఇక్కడికి తీసుకురాగా.. డాక్టర్‌కు బదులుగా నర్సు ఆపరేషన్ చేసింది. దీంతో ఈ ఆపరేషన్‌ వల్ల తల్లి మృతిచెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బిడ్డ మాత్రం క్షేమంగా ఉన్నట్లు సమాచారం.

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు