ఒంగోలు అర్బన్: ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆదివారం ఒంగోలు వస్తున్నట్లు ఎంపీ కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. విజయవాడ నుంచి మధ్యాహ్నానికి ఒంగోలు చేరుకొని ఆయన నివాసంలో ప్రజలకు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారన్నారు.