ప్రశాంతంగా ఎంపీఈవోల ఇంటర్వ్యూలు

28 Sep, 2016 22:25 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌ : స్థానిక వ్యవసాయశాఖ జేడీ కార్యాలయంలో  బుధవారం  జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మికాంతం సమక్షంలో మల్టీపర్పస్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్స్‌ (ఎంపీఈవో) అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరిగాయి. 124 పోస్టుల భర్తీలో భాగంగా తొలిరోజు  98 మందికి జేసీ, వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి, ఆత్మ పీడీ డాక్టర్‌ పి.నాగన్న, ఏరువాక కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ డి.సంపత్‌కుమార్‌   ఇంటర్వ్యూ చేశారు.  గురువారం రెండో రోజు 101 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయనున్నారు.

మరిన్ని వార్తలు