నేడు, రేపు ఎంపీఈఓ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు

27 Sep, 2016 22:58 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌ : వ్యవసాయశాఖ పరిధిలో దరఖాస్తు చేసుకున్న మల్టీపర్పస్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్స్‌ (ఎంపీఈఓ) అభ్యర్థులకు బుధ, గురువారం) ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. 124 పోస్టుల భర్తీలో భాగంగా  ఇంటర్వ్యూలకు హాజరు కావాలని 231 మందికి కాల్‌లెటర్లు పంపామన్నారు. స్థానిక వ్యవసాయశాఖ  కార్యాలయంలో బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 130 మందికి, 29న (గురువారం) 101 మందికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు. 

మరిన్ని వార్తలు