చిట్యాల: వరంగల్ జిల్లా చిట్యాల మండలం తహశీల్దార్ రవీందర్ శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవీందర్ గత గ్రూప్స్ పరీక్షలో ఎమ్మార్వో ఉద్యోగం సాధించాడు. అంతకుముందు పోలీస్ డిపార్టుమెంటులో విధులు నిర్వహించాడు. హన్మకొండలోని ప్రగతినగర్లో రవీందర్ నివాసం ఉంటూ చిట్యాల మండల ఎమ్మార్వోగా విధులు నిర్వహించేవాడు. అయితే ఆత్మహత్యకు గత కారణాలు ఇంకా తెలియరాలేదు.