26న కర్నూలుకు ముద్రగడ రాక

25 Feb, 2017 00:38 IST|Sakshi
కర్నూలు(అర్బన్‌): మాజీ మంత్రి, కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 26న కర్నూలుకు రానున్నట్లు కాపు, తెలగ, బలిజ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు యర్రంశెట్టి నారాయణరెడ్డి, నగర కార్యదర్శి అమరం నరసింహారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని మెగాసిరి ఫంక్షన్‌హాల్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీసీ రిజర్వేషన్ల సాధనకు సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తారన్నారు. దీక్షల్లో ముద్రగడ పాల్గొంటున్నారని.. జిల్లాలోని కాపు, తెలగ, బలిజ సామాజిక వర్గాలకు చెందిన వారంతా హాజరు కావాలని కోరారు.
 
>
మరిన్ని వార్తలు