రాజమండ్రి: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలకు అనుమతించడం లేదని వైద్యులు పేర్కొన్నారు. చూడటానికి ఆరోగ్యం గానే ఉన్నా ఆయన శరీరంలో అనేక మార్పులు వస్తాయని వెల్లడించారు. ఆదివారం వైద్యులు మీడియాతో మాట్లాడారు. ఏ సమయంలో పరీక్షలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని వైద్యులు స్పష్టం చేశారు.
కాగా, కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా, కిర్లంపూడిలో ముద్రగడ తన ఇంటి వద్ద చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ముద్రగడ దీక్షకు పలువురు నేతలు మద్దతు పలికారు.