అలరించిన సంగీత కచేరి

9 Oct, 2016 00:00 IST|Sakshi

పుట్టపర్తి టౌన్ : సత్యసాయిని కొనియాడుతూ సత్యసాయి విద్యార్థినులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. దసరా   వేడుకల్లో భాగంగా శని వారం సాయంత్రం సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రశాంతి విద్వాన్‌ మహాసభ నిర్వహించారు. సత్యసాయి విద్యాసంస్థల అసోసియేట్‌ ప్రోఫెసర్‌ రుచిర్‌ దేశాయ్‌ ప్రసంగించారు. షిరిడీ సాయి , సత్యసాయి జీవిత చరిత్రలను వివరిస్తూ ప్రసంగించారు. సత్యసాయి విద్యాసంస్థల అనంతపురం క్యాంపస్‌కు చెందిన విద్యార్థినులు సంగీత కచేరి నిర్వహించారు.

మరిన్ని వార్తలు