స్వామివారి ఆలయానికి క్యూ కట్టిన ముస్లింలు

9 Apr, 2016 10:54 IST|Sakshi
స్వామివారి ఆలయానికి క్యూ కట్టిన ముస్లింలు

 కడప: ఉగాది పర్వదినం సందర్భంగా శుక్రవారం కడప నగరంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయానికి ముస్లిం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచే స్వామి, అమ్మవార్లను దర్శించుకుని కొబ్బరి కాయలు సమర్పించారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించి లడ్డూలను కొనుగోలు చేశారు.

బీబీ నాంచారమ్మను తాము కుమార్తెగా భావిస్తామని, ఆ దృష్ట్యా శ్రీనివాసుడు తమకు అల్లుడవుతాడని... ప్రతి ఏటా ఉగాది రోజున ఆయనకు దిన భత్యం సమర్పించి పూజలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని ఈ సందర్భంగా ముస్లిం మహిళలు తెలిపారు. కాగా, ఉదయం 10 గంటలకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉగాది అస్థానం నిర్వహించారు.

 

మరిన్ని వార్తలు