వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన ముస్లిం మైనారిటీలు

30 Jul, 2016 22:48 IST|Sakshi
వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన ముస్లిం మైనారిటీలు

ఎర్రగుంట్ల:   
మున్సిపల్‌ పరిధిలోని రాణివనంలో ఉన్న సుమారు 35 మైనారిటీ కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టరు ఎంవీ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలు నచ్చక వివిధ వర్గాల వారు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు చెప్పారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎస్‌ గౌస్, ఖాదర్‌బాషా,  సాహిద్, కరీం, హనీఫ్, నూర్, హజిమస్తాన్, విజయ్, శివ, ఇమ్రాన్, ఖాలీల్, నిశాంత్, సాధిక్, మహమ్మద్‌బాషాలతో పాటు ఇతర కుటుంబాల వారు చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌రెడ్డి,  వైఎస్సార్‌ సీపీ నాయకులు వై. విశ్వభార్గవరెడ్డి, కౌన్సిలర్‌ సూర్యనారాయణరెడ్డి, మల్లుగోపాల్‌రెడ్డి, గంగాకృష్ణారెడ్డి, జయరామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు