భక్తిశ్రద్ధలతో మిలాద్‌ ఉన్‌ నబీ

12 Dec, 2016 23:24 IST|Sakshi
తాడితోట,(రాజమహేంద్రవరం) : 
మహ్మద్‌ ప్రవక్త బోధనలు సర్వ మానవాళికి అనుసరణీయమని ముస్లిం పెద్ద తెలిపారు. మహ్మద్‌ ప్రవక్త జయంతి సందర్భంగా సోమవారం మిలాద్‌ ఉన్‌ నబీని  భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సున్నీ ముస్లింల ఆధ్వర్యంలో నగర వీధులలో భారీ ఊరేగింపు నిర్వహించారు. జాంపేట ఆజాద్‌ చౌక్‌ నుంచి మెయి¯ŒS రోడ్డులోని పెద్ద మసీదు, నగరంలోని ప్రధాన రహదారుల మీదుగా ర్యాలీ నిర్వహించారు. మహ్మద్‌ ప్రవక్త బోధనలను వివరిస్తూ నినాదాలు చేశారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మైనార్టీ సెల్‌ నాయకుడు మహ్మద్‌ ఆరీఫ్, జాంపేట లై¯ŒS మసీద్‌ అధ్యక్షుడు హబిబుల్లా ఖాన్, రాయల్‌ మసీద్‌ అధ్యక్షుడు షేక్‌ అసదుల్లా అహ్మద్, దానవాయిపేట మసీద్‌ అధ్యక్షుడు ఎస్‌.ఎ.ఆలీం, ముస్లిం పెద్దలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
 

 

మరిన్ని వార్తలు