దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలి

15 Sep, 2016 22:38 IST|Sakshi
దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలి

కోదాడఅర్బన్‌: ఇంజనీరింగ్‌ విద్యార్థులు సృజనాత్మకతను పెంచకుని నూతన ఆవిష్కరణలు చేస్తూ దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని కాకినాడ జెఎన్‌టీయూ ప్రొఫెసర్‌ కెవీ మరళీకృష్ణ కోరారు. ఇంజనీర్స్‌డే సందర్భంగా గురువారం పట్టణంలోని కిట్స్‌ మహిళా ఇంజనీరింగ్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యక్తిత్వ వికాసంపై జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ విద్యార్థులు చేసే ప్రతిపనిలో స్పష్టత కలిగి ఉండాలన్నారు. కొత్త ఆలోచనలు, నిరంతర ప్రయత్నాలతో విద్యార్థులు ఇంజనీర్లుగా రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు నిర్వహించిన పలు పోటీలలో విజేతలైన వారికి ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ నీలా సత్యనారాయణ, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీహెచ్‌ నాగార్జునరావు, ఎఓ కృష్ణారావు, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు