స్నాతకోత్సవానికి నల్సార్ ముస్తాబు

6 Aug, 2016 09:14 IST|Sakshi
శామీర్‌పేట్: 
నల్సార్ న్యాయవిశ్వవిద్యాలయం ప్రాంగణం లో నేటి సాయంత్రం 4గంటలకు 14వ స్నాతకోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నల్సార్ లా యూనివర్సీటీ వైస్ చాన్‌‌సలర్ ఫ్రొ.ఫైజాన్‌ముస్తఫా, రిజి్ట్రార్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలోని జస్టీస్ సిటీ ప్రాంగణంలో నిర్వహించే 14వ స్నాతకోత్సవాలను అట్టహాసంగా నిర్వహించేం దుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా టీఎస్.ఠాకూర్, విశిష్ట అతిథిగా తెలం గాణ -ఆంధ్రప్రదేశ్ (ఉమ్మిడి) రాష్ట్రాల సంయు క్త హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ చాన్‌‌సలర్ జస్టీస్ రమేశ్‌రంగనాథన్‌లతో పాటుపలువురు ప్రముఖులు విచ్చేస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని వార్తలు