బ్యాగులో పాత కరెన్సీతో బాలకృష్ణ సతీమణి

12 Dec, 2016 14:59 IST|Sakshi
బ్యాగులో పాత కరెన్సీతో బాలకృష్ణ సతీమణి

తిరుపతి ఎయిర్‌పోర్టులో గుర్తింపు
రికార్డులున్నాయని ధ్రువీకరణ

రేణిగుంట: సినీనటుడు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుందరాదేవి బ్యాగులో  రూ.10లక్షలు బయటపడటం కాస్సేపు కలకలం రేపింది. తిరుమల సందర్శనకు ఆమె హైదరాబాద్ నుంచి శనివారం ఉదయం స్పైస్‌జెట్ విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టులో దిగారు. చెక్‌ఔట్ సందర్భంలో ఎయిర్‌బోర్టు సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఆమె బ్యాగ్‌లో నగదు కట్టలు గుర్తించినట్లు విమానాశ్రయం సిబ్బంది తెలిపారు.


ఆ రూ.10లక్షలు పాతనోట్లకు ఆమె ఐటీ రికార్డులు చూపడంతో, సక్రమంగా ఉన్నట్లు వారు చెప్పారు. ఈ విషయమై ఎయిర్‌పోర్టు డెరైక్టర్ పుల్లాకు సమాచారం ఇచ్చాక, ఆమెను నగదుతోపాటు పంపించినట్లు వెల్లడించారు. తర్వాత ఆమె కుటుంబసభ్యులతో కలసి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లినట్లు తెలిసింది. అయితే ప్రయాణంలో అంత నగదు కూడా ఎందుకు తీసుకువెళ్తున్నారనే అంశం చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు