చంద్రబాబు ఓ అబద్ధాల పుట్ట

21 Apr, 2017 04:40 IST|Sakshi
చంద్రబాబు ఓ అబద్ధాల పుట్ట
► బాబుకు మహిళలు, రైతుల ఉసురు తగలక తప్పదు
► అంబేడ్కర్‌కు దండ వేసే అర్హత  సీఎంకు లేదు
► ఎమ్మెల్యే నారాయణస్వామి ఆగ్రహం
 
కార్వేటినగరం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను వంచిస్తూ ఓ అబద్ధాల పుట్ట, దగాకోరుగా నిలిచారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి  విమర్శించారు. బుధవారం కార్వేటినగరం స్కంధపుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎస్సీల అభ్యున్నతిని ఓర్వలేని ముఖ్యమంత్రి , అంబేడ్కర్‌ విగ్రహానికి పూలదండ వేసే అర్హత కూడా లేదన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు మూడేళ్లుగా ఎక్కడగానీ సెంటు భూమి, ఇంటి స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవని, ఓట్లకోసమే ఎస్సీలను, వెనుకబడిన వారిని పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రికి ఎస్సీ, ఎస్టీ, మైనా రిటీలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. రుణమాఫీ కాక, బ్యాంకర్ల నోటీసులతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, దీనికి సీఎం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. గత ఏడాది విపత్తు మూలాన పంటలు నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు బీమా పరిహారం ఇచ్చిన పాపానపోలేదని దుయ్యబట్టారు. అనంతరం కార్వేటినగంరలో జరిగిన సింగిల్‌విండో డైరెక్టర్‌ «ధనంజయవర్మ తల్లి కర్మక్రియల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట సింగిల్‌విండో అధ్యక్షుడు లోకనాథరెడ్డి, రైతు విభాగం జిల్లా కార్యదర్శి పద్మనాభశెట్టి, వెంకటరత్నం, శేషాద్రి తదితరులు ఉన్నారు. 
మరిన్ని వార్తలు