అనంతపురం : పెద్దనోట్లను ఎందుకు రద్దు చేశారో తనకు తెలియదని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ... నోట్ల రద్దును అన్ని పార్టీలు వ్యతిరేకించినా చంద్రబాబు సమర్థించారన్నారు. రూ.2వేల నోట్లను కూడా రద్దు చేస్తే నల్లధనం కంట్రోల్ అవుతుందని నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదాతో ఉద్యోగాలు రావని, ప్రత్యేక ప్యాకేజీ వల్లే వస్తాయని ఆయన అన్నారు. ఏపీలో ఇప్పటివరకూ మూడు నుంచి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.