నంద్యాల: తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని కోనసీమ చిత్రకళా పరిషత్ నిర్వహించిన 27వ జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీల్లో ప్రముఖ చిత్రకారుడు చందా రామయ్యకు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. కళాపరిషత్ నిర్వాహకులు పంపిన లేఖ ఆయనకు గురువారం అందింది. ఆయన చిత్రీకరించిన రాజనర్తకీ చిత్రానికి స్వర్గీయ వడ్డాది పాపయ్య స్మారక అవార్డును ప్రకటించారు. ఈ అవార్డును ఆయన జనవరి 22న జరిగే వేడుకల్లో అందుకోనున్నారు.