సాక్షి, హైదరాబాద్: సీఎస్ఐఆర్– ఎన్జీఆర్ఐలో చీఫ్ సైంటిస్టు ఎన్.పూర్ణచందర్రావుకు కేంద్ర గనులశాఖ అందించే ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు దక్కింది. భూగర్భ అంశాల్లో ఆయన సేవలకుగాను కేంద్రం ‘నేషనల్ జియోసైన్స్ అవార్డు’కు ఎంపిక చేసింది. భూకంపాలు, భూగర్భంలో జరిగే అంతర్గత మార్పులపై పలు పరిశోధనలను జరిపిన ఆయన ‘భూకంప అధ్యయనంలో శాస్త్రీయ తవ్వకాలు’ పరిశోధనలకు బృంద నాయకునిగా వ్యవహరిస్తున్నారు.