నేడు ఆర్ట్స్‌ కళాశాలలో జాతీయ సదస్సు

8 Feb, 2017 22:13 IST|Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌ : స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ‘భారతదేశంలోని మహిళా నిష్ణాతులు - దేశాభివృద్ధిలో వారి పాత్ర’ అనే అంశంపై రెండురోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సదస్సు గురువారం ప్రారంభం కానుంది. వివిధ రాష్ట్రాల నుంచి ఆచార్యులు, మేధావులు హాజవుతారని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌.రంగస్వామి, సదస్సు కన్వీనర్‌ బి.జమీలాబీబీ, కో-ఆర్డినేటర్‌ టి.శైలజారాణి తెలిపారు. వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు ఈ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు