నవ్యాంధ్ర మాలదాసు సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడిగా యామర్తి

25 Jul, 2016 17:33 IST|Sakshi

ఒంగోలు: నవ్యాంధ్ర మాలదాసు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా యామర్తి వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. స్థానిక సంతపేటలోని సాయిబాబా మందిరం కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యదర్శిగా వైఎన్‌ ధనుంజయరావు, కోశాధికారిగా దాసరి మల్లికార్జున, ఉపాధ్యక్షుడిగా కొలచనకోట సింగయ్యతోపాటు పలువురు ఈసీ మెంబర్ల ఎంపిక చేశారు. అనంతరం మండల అధ్యక్షుల నియామకం జరిగింది. ఒంగోలు మండల అధ్యక్షుడిగా కనుమాల రాఘవులు, అద్దంకి–ఎస్‌.శ్రీనివాసరావు, సంతమాగులూరు–ఎన్‌.నాగేశ్వరరావు, తాళ్లూరు–వై.తిరుపతయ్య, హనుమంతునిపాడు–ఆండ్ర నరసయ్య, కందుకూరు–డి.మాలకొండయ్య, దొనకొండ–వై.రంగనాయకులు, దర్శి–ఎస్‌.శ్రీనివాసరావు, పొన్నలూరు–బి.వీరబ్రహ్మం, వై.పాలెం–డి.శివ, త్రిపురాంతకం–గడ్డం వెంకట కృష్ణయ్య, మార్టూరు–గుంటూరు శంకరరావు, కొనకనమిట్ల–ఎ.చినకోటయ్యలను ఎన్నుకున్నారు. ఎన్నికైన వారికి రాష్ట్ర అధ్యక్షుడు తిరుక్కోవళ్లూరి పూర్ణయ్య, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నేలటూరి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు మెండెం శ్రీనివాసరావులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పొనుగుబోటి రామాంజనేయులును రాష్ట్ర ఉద్యోగ సంఘం కార్యదర్శిగా నియమించారు. హిందూధర్మానికి కట్టుబడిన హరిదాసులను తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార మండలి జిల్లా అధ్యక్షుడు, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు కోఆర్డినేటర్‌ అళహరి చెంచలరావు, కార్యదర్శి పొన్నూరి వెంకట శ్రీనివాసులు ఘనంగా సత్కరించారు. 

>
మరిన్ని వార్తలు