డోజర్‌ ట్రాక్టర్‌ డ్రైవర్లపై నక్సల్స్‌ దాడి ?

9 Aug, 2016 00:14 IST|Sakshi
కొత్తగూడ : మండలంలోని పెద్ద ఎల్లాపూర్‌ అటవీ ప్రాంతంలో ఫారెస్టు ప్లాంటేషన్‌ పనులు చేస్తున్న డోజర్‌ ట్రాక్టర్ల డ్రైవర్లను న్యూడెమోక్రసీ పుల్లన్న దళం కొట్టినట్లు సోమవారం తెలిసింది. పెద్ద ఎల్లాపురం గ్రామ సమీపంలోని 72 హెక్టార్లలో ప్లాంటేషన్‌ చేసేందుకు అటవీశాఖ అనుమతి ఇవ్వడంతో నెల రోజులుగా పనులు జరుగుతున్నాయి. ఆ పనులను అడ్డుకునేందుకు గ్రా మస్తులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్లాంటేషన్‌ పని చేసేందుకు వచ్చిన పొగుళ్లపల్లికి చెందిన ట్రాక్టర్లతో పాటు మరో రెండు ట్రాక్టర్ల వద్దకు వెళ్లిన పుల్లన్న దâ భ్యులు..డ్రైవర్లపై దాడి చేసినట్లు సమాచారం. పెద్ద ఎల్లాపురం గ్రామ సమీపంలో భారీగా పోడు జరిగిందని ఇక్కడి బీట్‌ అధికారి శ్యాంను సస్పెండ్‌ చేశారు. అయితే పోడు జరిగిన ప్రదేశంలో ప్లాంటేషన్‌ చేయించాలనే నిబంధనలకు మేరకు సస్పెండ్‌ చేసిన బీట్‌ అధికారికి అదే బాధ్యతలను అప్పగించారు. దీంతో 72 హెక్టార్లలో ప్లాంటేషన్‌ చేసేందుకు రంగం సిద్ధమైంది. కాగా, ఇందులో ఉన్న పేద, మద్యతరగతి రైతులు ఉం డడం ప్లాంటేషన్‌ నిలిపివేయాలని ఆందోళన చేసినా పోలీసుల సహకారంతో పను లు చేసేందుకు అటవీ అధికారులు ముందుకొచ్చారు. ఈ క్రమంలో పుల్లన్న దళ సభ్యులు డ్రైవర్లను కొట్టడం చర్చనీయంశంగా మారింది. ఈ విషయమై ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావును వివరణ కోరగా డ్రైవర్లను కొట్టిన విషయం నిజమేనని, ఏ దళం కొట్టిందని వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.   
మరిన్ని వార్తలు