-
కోర్టులో హాజరు... 14 రోజుల రిమాండ్
కోరుట్ల : కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన బీడీ లీవ్స్ వ్యాపారి ఖుర్రంను బెదిరించిన కేసులో జగిత్యాలకు చెందిన కట్ట శివను శనివారం పోలీసులు అరెస్టు చేసి మెట్పల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు శివకు ఈనెల 23 వరకు జుడిషియల్ రిమాండ్ విధించింది. బీడీ లీవ్స్వ్యాపారి ఖుర్రంను నయీం అనుచరులు కోరబోయిన రమేష్, నగునూరి గోవర్ధనచారి జూలైలో డబ్బుల కోసం బెదిరించారు. ఈ క్రమంలో కట్ట శివ వీరితో పాటు ఉన్నాడు. నయీం అనుచరులతో శివ రెండుసార్లు ఖుర్రం వద్దకు వచ్చి వెళ్లినట్లు తెలిసింది. రమేష్, గోవర్ధనచారిలను విచారించిన పోలీసులు ఖుర్రంను బెదిరించిన వ్యవహారంలో శివ ప్రమేయం ఉందని గుర్తించారు. అతనిపై 302, 384, 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలో కట్ట శివ హైదరాబాద్ సమీపంలోని ఘట్కేసర్ వద్ద సుమారు 40 ఎకరాల స్థలం సెటిల్మెంట్ వ్యవహారంలో నయీంను ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే నయీం అనుచరుడు కోరబోయిన రమేష్తో శివకు పరిచయమైనట్లు తెలిసింది. ఈ స్థల వివాదంపైనా సిట్ పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.