నెహ్రూ తాతకు వందనం

14 Nov, 2016 22:35 IST|Sakshi
మలికిపురం  :
మాజీ ప్రధాని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూకు మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలోని వివేకానంద కాన్వెంట్‌ విద్యార్థులు వినూత్న రీతిలో నివాళులర్పించారు. నెహ్రూజీ పుట్టిన రోజును పురస్కరించుకొని సోమవారం ఆయన చిత్రాన్ని రంగులతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆ చిత్రం చుట్టూ కూర్చుని వందనాలు సమర్పించి, ఆయన పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.   
 
మరిన్ని వార్తలు