నేవల్‌ డాక్‌యార్డ్‌ అడ్మిరల్‌ సూపరింటెండెంట్‌గా నారాయణ్‌ ప్రసాద్‌

29 Jul, 2016 00:45 IST|Sakshi
సాక్షి, విశాఖపట్నం : నేవల్‌ డాక్‌యార్డ్‌ అడ్మిరల్‌ సూపరింటెండెంట్‌గా రియర్‌ అడ్మిరల్‌ నారాయన్‌ ప్రసాద్‌ ఎన్‌ఎం నియమితులయ్యారు. ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఉన్న రియర్‌ అడ్మిరల్‌ ఎస్‌ఆర్‌ శర్మ చీఫ్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌(టెక్నికల్‌)గా ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రసాద్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంజినీర్‌ ఆఫీసర్‌గా 1983 జూలై 1న ప్రసాద్‌ నేవీలో అడుగుపెట్టారు. ఆపరేషన్స్, స్టాఫ్, డాక్‌యార్డ్, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో వివిధ స్థాయిల్లో పనిచేశారు.
 
మరిన్ని వార్తలు