తట్టుకు నూతన వ్యాక్సిన్‌

15 May, 2017 23:14 IST|Sakshi
కర్నూలు(హాస్పిటల్‌): మీజిల్స్‌(తట్టు)కు కొత్త వ్యాక్సిన్‌ రాబోతోంది. ప్రస్తుతం ఇస్తున్న మీజిల్స్‌ టీకా వేసినా పిల్లలకు, పెద్దలకు తట్టు వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు మీజిల్స్‌ రుబెల్లా వ్యాక్సిన్‌(ఎంఆర్‌) అనే కొత్త వ్యాక్సిన్‌ను తీసుకొస్తోంది. దీనిని వచ్చే ఆగష్టు నుంచి పిల్లలకు వేస్తారని డిస్ట్రిక్ట్‌ ఇమ్యునైజేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వెంకటరమణ చెప్పారు. 9 నెలల వయసు నుంచి 15 ఏళ్ల వయసు వరకు ఈ వ్యాక్సిన్‌ను ఒక డోసు వేసుకోవచ్చన్నారు. ప్రతి నెలా నిర్ణీత తేదీల్లో జిల్లా వ్యాప్తంగా దీనిని పిల్లలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా మొత్తంగా 7లక్షల వరకు 15 ఏళ్లలోపు పిల్లలుటార‍న్నారు. 
 
మరిన్ని వార్తలు