మాదే కదా రేపు.. అందుకు సాక్ష్యం ఈ కూరుపు..

30 Dec, 2016 22:14 IST|Sakshi
కొత్త సంవత్సరం వస్తోందంటేనే బోలెడు సందడి, సంబరం. కంటికి కనబడని కాలం చుట్టూ కోటి కలలు, ఆశలు. శనివారం అర్ధరాత్రి కాలిడనున్న ‘2017’ సంవత్సరానికి వినూత్నంగా స్వాగతం పలికారు కడలి గ్రామంలోని నలంద పాఠశాల విద్యార్థులు. శుక్రవారం 270 మంది విద్యార్థులు ‘2017’ సంఖ్య ఆకృతి వచ్చేలా కూర్చుండగా, మరో130 మంది విద్యార్థులు వారి చుట్టూ వలయంలా నిలుచున్నారు. కరస్పాండెంట్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శన ఆకట్టుకుంది. ఎంపీపీ అనచూరి సునీత, కడలి, ములికిపల్లి సర్పంచ్‌లు వడి సత్యం, అనచూరి రామపురుషోత్తం, న్యాయవాది అప్పారి హరిబాబు విద్యార్థుల ప్రదర్శనను తిలకించారు.             
–కడలి (రాజోలు)
 
మరిన్ని వార్తలు