వచ్చే నెల 3న మెగా రక్తదాన శిబిరం

30 Aug, 2016 01:13 IST|Sakshi

మోత్కూరు
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యా ఫెడరేషన మోత్కూరు ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో వచ్చేనెల 3న మోత్కూరులోని శ్రీలక్ష్మీ ఫెట్రోల్‌ బంక్‌ ఆవరణలో మెగా రక్తశిబిరం నిర్వహిస్తున్నట్టు ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా వైస్‌ చైర్మన్‌ లక్ష్మీనర్సింహారెడ్డి, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి మెతుకు సైదులు తెలిపారు. సోమవారం కార్యక్రమ కరపత్రాలను మండలకేంద్రంలో వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు సోమేశ్వర్, తొర్ర ఉప్పలయ్య, సుబ్రహ్మణ శర్మ, దొర్న వెంకన్న, మోత్కూరు రెడ్‌క్రాస్‌ సొసైటీ అధ్యక్షుడు చింతల సత్యనారాయణరెడ్డి, సభ్యులు అనిల్, సత్యంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు