కీచక కానిస్టేబుల్పై నిర్భయ కేసు నమోదు

12 Apr, 2016 09:45 IST|Sakshi
కీచక కానిస్టేబుల్పై నిర్భయ కేసు నమోదు

కదిరి: ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఎంచుకున్న పోలీస్ వృత్తికే ఓ కానిస్టేబుల్ మాయని మచ్చ తెచ్చిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

కదిరిలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న రాజేంద్ర తన కీచక బుద్ధిని ప్రదర్శించాడు. తన మాజీ స్నేహితురాలైన వ్యవసాయ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె కాపురంలో కల్లోలం సృష్టించాడు. ఆమె తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆమె భర్తకు పంపించడంతో పాటు సోషల్ మీడియాలో  పెట్టాడు. దీంతో బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కానిస్టేబుల్ రాజేంద్రపై నిర్భయ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు