జైళ్లల్లో అవినీతి లేదు: డీజీ వీకే సింగ్

1 Jun, 2016 23:02 IST|Sakshi

మహబూబ్‌నగర్ క్రైమ్: రాష్ట్రంలోని జైళ్లలో అవినీతి ఏ మాత్రమూ లేదని, పూర్తిగా పారదర్శకంగా బాధ్యతతో విధులు నిర్వహిస్తున్నందుకు గర్వపడుతున్నామని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్ సింగ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జైలుశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని వన్‌టౌన్ సమీపంలో ఖైదీలతో నిర్వహించనున్న పెట్రోల్ బంకును బుధవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇది ఐదవ పెట్రోల్ బంక్ అని తెలిపారు. ఖైదీల్లో మార్పు., వారిలో ఆత్మస్థయిర్యం నింపడం కోసమే ఈ పెట్రోల్‌బంక్ తెరిచినట్లు తెలిపారు. ఇందులో వారే వర్కర్లుగా ఉంటారని, రోజువారి వేతనం ఇవ్వనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు