అభివృద్ది పేరుతో విధ్వంసం వద్దు

23 Jul, 2016 17:57 IST|Sakshi
అభివృద్ది పేరుతో విధ్వంసం వద్దు

2013 భూసేకరణ  చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి

26న హైదరాబాద్‌లో సీపీఎం మహాధర్నా పోస్టర్‌ విడుదల


పరిగి: నిర్వాసితులకు  2013 భూసేకరణ  చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని సీపీఎం డివిజన్‌ కార్యదర్శి వెంకటయ్య అన్నారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో  ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన మహా ధర్నా పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ సమీపంలో నిర్మిస్తున్న రిజర్వాయర్‌తో కుల్కచర్ల, గండేడ్‌ మండలాల్లో ఆరు గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రవి, యాదగిరి, నసీర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు