ఎయిర్ పోర్ట్ సందర్శకులకు 'నో ఎంట్రీ'

10 Aug, 2015 11:01 IST|Sakshi

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చూడాలనుకునేవారికి ఇది కొంచెం ఇబ్బంది కలిగించే విషయం. నేటి నుంచి ఈ నెల 30 వరకు విమానాశ్రయాన్ని సందర్శించేందుకు వచ్చేవారికి అధికారులు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల హెచ్చరికల ప్రకారం భద్రతా దృష్ట్యా ఎయిర్ పోర్ట్ చుట్టుపక్కల రక్షణా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. ప్రతిఒక్కరినీ తనిఖీ చేసి ఎయిర్ పోర్టు అధికారులు లోపలికి అనుమతిస్తున్నారు. దాదాపు ఈ నెలాఖరు వరకు ఈ పరిస్థితి ఉండనుంది.

>
మరిన్ని వార్తలు