తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

5 Jul, 2016 08:21 IST|Sakshi

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు మూడు కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు, ప్రత్యక ప్రవేశ దర్శనానికి ఓ గంట సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 72,061 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు