అందని పింఛన్‌ డబ్బులు..!

4 Mar, 2017 00:27 IST|Sakshi
అందని పింఛన్‌ డబ్బులు..!
దేవనకొండ: మండలంలోని 12 గ్రామ పంచాయతీలకు శుక్రవారం పింఛన్‌ డబ్బులు రాలేదు. దీంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండలంలోని చెల్లిచెలిమల, వెలమకూరు, నల్లచెలిమల, కప్పట్రాళ్ల, దేవనకొండతో పాటు మరో 7 పంచాయతీలకు మార్చి నెలకు సంబంధించిన పింఛన్‌ డబ్బులు బ్యాంకులో జమ కాలేదు. దీంతో 3 వేల మంది పింఛన్‌ లబ్ధిదారులకు పింఛన్లు అందలేదు. ఉదయాన్నే పంచాయతీ కార్యాలయాలకు ఎన్నో వ్యయ ప్రయాసాలు ఓర్చి వచ్చిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్‌ డబ్బులు రాలేదని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. 
 
మరిన్ని వార్తలు