అక్రమ ఆయుధాల కేసులో ఎంపీకి నోటీసులు

14 Aug, 2015 23:53 IST|Sakshi
అక్రమ ఆయుధాల కేసులో ఎంపీకి నోటీసులు

అనంతపురం: అక్రమ ఆయుధాల కోనుగోలు వ్యవహారంలో ఓ ఎంపీకి అనంతపురం జిల్లా పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ నెల 20వ తేదీలోపు అనంతపురం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలని బళ్లారి (కర్ణాటక) ఎంపీగా కొనసాగుతున్న శ్రీరాములుకు శుక్రవారం పోలీసులు నోటీసులు అందించారు.

మూడు రోజుల కిందట అనంతపురం రైల్వే స్టేషన్ వద్ద నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించడాన్ని పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తుపాకీ కొనుగోలు వ్యవహారం బయటికొచ్చింది. అయితే పట్టుబడ్డ నలుగురూ తాము బళ్లారి ఎంపీ శ్రీరాములు సంబంధీకులమని చెప్పారు. దీంతో ఎంపీని ప్రశ్నించాలని పోలీసులు భావించారు. ఈ మేరకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.

మరిన్ని వార్తలు