జ్యోతినగర్ : నగర వన ఉద్యన యోజనకు ఎన్టీపీసీ రామగుండం సంస్థ గురువారం రూ.11.20 లక్షలు అందించింది. పరిపాలనా భవనంలో జరిగిన కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి రాజిరెడ్డికి ఏజీఎం రఫిక్ ఉల్ ఇస్లాం చెక్కును అందజేశారు. రామగుండం సమీపంలోని కుందనపల్లి ఐఓసీ ఏరియాలో నూతనంగా నిర్మిస్తున్న పార్కుకు రూ.10లక్షలు, అందులో బోర్వెల్ నిర్మించేందుకు రూ.1.20 లక్షలు అందించింది. కార్యక్రమంలో ఎన్టీపీసీ సీఎస్సార్ డెప్యూటీ మేనేజర్ ఆకుల రాంకిషన్, హెర్ఆర్ అధికారి శ్రీపతిరావు, విఠల్కుమార్ పాల్గొన్నారు.