28నుంచి ఎన్టీపీసీ సదరన్‌ రీజియన్‌ స్పోర్ట్స్‌ మీట్‌

24 Jul, 2016 19:34 IST|Sakshi
జ్యోతినగర్‌: ఎన్టీపీసీ సదరన్‌ రీజియన్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ఈనెల 28 నుంచి 30 వరకు ఆంధ్రప్రదేశ్‌ విశాఖ జిల్లాలోని సింహాద్రి ప్రాజెక్టులో నిర్వహిస్తున్నట్లు రామగుండం స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ కార్యదర్శి మంగళంపల్లి రాంనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. రామగుండం ఎన్టీపీసీ నుంచి వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్, బిలియర్డ్స్‌ పోటీలకు 30 మంది క్రీడాకారులు హాజరవుతున్నట్లు తెలిపారు. 
మరిన్ని వార్తలు