ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు

30 May, 2016 12:28 IST|Sakshi

ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం సుర్జాపూర్ గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి గుర్తు తెలియని నిప్పుపెట్టారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో విగ్రహానికి స్వల్పంగా నష్టం వాటిల్లింది. సోమవారం గమనించిన పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ గ్రామంలో ధర్నా చేపట్టారు.

 

మరిన్ని వార్తలు