కృష్ణాజిల్లా నూర్బాషా (ముస్లిం)సంక్షేమ సంఘం
పటమట(ఆటోనగర్):
ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ప్రజాసాధికార సర్వేలో నూర్బాషాలను ముస్లింలుగా పేర్కొంటున్నారని, నూర్బాషా కులాన్ని బీసీ(బి)గా నమోదు చేయాలని కృష్ణాజిల్లా నూర్బాషా (ముస్లిం) సంక్షేమ సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం పటమటలోని ఆషా ఫంక్షన్ హాలులో సంఘం సమావేశం నిర్వహించారు. సంఘ గౌరవాధ్యక్షుడు షేక్ సైదులు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాసాధికార సర్వేలో నూర్బాషా(దూదేకులు)కులాన్ని ముస్లింలలో చేర్చడం వలన నూర్బాషాలు రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదముందన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తమ విద్యార్థులకు రిజర్వేషన్ ఇచ్చి రీయంబర్స్మెంటు సౌకర్యం కల్పించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కృష్ణాజిల్లా నూర్బాషా(ముస్లిం)సంక్షేమ సంఘం అధ్యక్షుడు షేక్ బాషా, ప్రధాన కార్యదర్శి షేక్ అల్లానబి, ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ మస్తాన్, సభ్యుడు షేక్ మస్తాన్వలి, తదితరులు పాల్గొన్నారు.