కలెక్టరేట్‌ కార్యాలయాన్ని సందర్శించిన అధికారులు

20 Sep, 2016 22:23 IST|Sakshi
కలెక్టరేట్‌ కార్యాలయాన్ని సందర్శించిన అధికారులు
దురాజ్‌పల్లి(చివ్వెంల) :  మండల పరిధిలోని దురాజ్‌పల్లి గ్రామ శివారులోని కామాక్షి ఇంజనీరింగ్‌  కళాశాలలో ఏర్పాటు చేయనున్న జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాల్లో భాగంగా తమ శాఖలకు కేటాయించిన గదులను  డీపీఓ పి.ప్రభాకర్‌ రెడ్డి, డీపీఆర్‌ఓ డి.నాగార్జునలు మంగళవారం సందర్శించారు. ఈసందర్భంగా డీపీఓ మాట్లాడుతూ అనుమతులు లేకుండా వెంచర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను ఆదేశించారు.  ఈకార్యక్రమంలో ఈఓఆర్డీలు గోపి, లక్ష్మీ, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.  
 
>
మరిన్ని వార్తలు