ఇంజక్షన్ వికటించి వృద్ధుడు మృతి

12 Sep, 2015 10:53 IST|Sakshi

నల్గొండ : నల్గొండ జిల్లా హాలియాలో ఒక ఆర్‌ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్ వికటించి వృద్ధుడు మృతి చెందాడు. హాలియా మండలం కొత్తపల్లెకు చెందిన లక్ష్మయ్య (60) కాలిలో మేకు గుచ్చుకుని.... గాయం తీవ్రమైంది. దీంతో వైద్యం కోసం అతడు 15 రోజుల క్రితం హాలియాలోని ఆర్‌ఎంపీ వైద్యుడు సూర్యనారాయణ వద్దకు వెళ్లాడు. నయం చేస్తానని చెప్పి రూ 25 వేలు తీసుకుని.. లక్ష్మయ్యను ఆస్పత్రిలో ఉంచి వైద్యం చేస్తున్నాడు.

ఆ క్రమంలో శుక్రవారం రాత్రి 10 గంటలకు లక్ష్మయ్యకు సూర్యనారాయణ ఇంజక్షన్ ఇచ్చాడు. 11.00 గంటలకే లక్ష్మయ్య మృతి చెందాడు. సూర్యనారాయణ ఇచ్చిన ఇంజక్షన్ వికటించడం వల్లే లక్ష్మయ్య మృతి అతడి బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఆందోళనకు దిగారు. ఆ విషయం తెలిసి ఆర్‌ఎంపీ వైద్యుడు సూర్యనారాయణ పరారయ్యాడు.

బంధువుల ఆందోళన శనివారం కూడా కొనసాగుతుంది. అయితే పట్టణానికి చెందిన పెద్దమనుషుల ద్వారా లక్ష్మయ్య బంధువులతో రాజీ ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అందుకు స్థానికంగా పెద్ద మనుషులు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు