కొనసాగుతున్నగాలింపు చర్యలు

10 Apr, 2017 12:39 IST|Sakshi
కొనసాగుతున్నగాలింపు చర్యలు

సిద్దవటం :  సిద్దవటం పెన్నానదిలో కొట్టుకుపోయి యువకుని కోసం పోలీసులు, ఈతగా ళ్లు సోమవారం గాలింపు చర్యలు చేపట్టారు. కడప నగరం ఇందిరానగర్‌కు చెందిన ఎనమ ల రామాంజనేయులు (22) అనే యువకుడు ఆదివారం మçధ్యాహ్నం సిద్దవటంలోని లోలెవెల్‌ కాజ్‌వే వద్దకు వచ్చి నీటిలో ఈత కొ డుతూ పెన్నాలో గల్లంతైన విషయం తెలిసిం దే. ఆదివారం రాత్రి, సోమవారం పెన్నానీటిలో ఇరువైపులా గాలింపు చర్యలు చేపడు తూ వెలుగుపల్లె గ్రామం దాటుకుని పెన్నానదిలో వెతికామని ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి తెలిపారు. తర్వాత ఎక్కడైనా ఇరుక్కుని ఉంటాడనే ఉద్దేశంతో బోటులో వెళ్లి కూడా గాలింపు చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు