లారీ–డీసీఎం ఢీ.. వ్యక్తి మృతి

2 Nov, 2016 09:06 IST|Sakshi

శంషాబాద్‌(రంగారెడ్డి): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ఘన్షిమియాగూడ వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొట్టడంతో.. ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

మరిన్ని వార్తలు