ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: వ్యక్తి మృతి

26 Jun, 2016 00:06 IST|Sakshi
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: వ్యక్తి మృతి

ఇల్లందు: ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణంలో శనివారం రాత్రి 10 గంటలకు జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఇల్లందు ప్రాంతానికి చెందిన అనిల్‌కుమార్(30) ద్విచక్ర వాహనంపై ఇల్లందు మెయిన్‌రోడ్డు బాబ్లీ హోటల్ సమీపంలో వెళుతుండగా వెనుకనుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న రవి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రుణ్ణి ఆస్పత్రికి తరలించారు.
 

మరిన్ని వార్తలు