కారు బోల్తా: ఒకరు మృతి

22 Sep, 2017 08:56 IST|Sakshi

మహబూబ్‌నగర్‌:
భూత్పూర్ మండలం అన్నాసాగర్ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. మహ్మద్‌ లతీఫ్‌, అతని కుటుంబీకులు, బంధువులతో కలిసి కారులో వెళ్తుండగా జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో మహ్మద్ లతీఫ్‌ అక్కడికక్కడే మృతిచెందారు. అతని భార్య, ఇద్దరు కుమారులతోపాటూ మరో ముగ్గురు బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు కేరళ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు