వడదెబ్బతో వ్యక్తి మృతి

25 May, 2017 23:06 IST|Sakshi

ధర్మవరం అర్బన్ : ధర్మవరం గాంధీనగర్‌లో కట్టా శ్రీనివాసులు(48) అనే కార్మికుడు వడదెబ్బకు గురై గురువారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. విజయవాడలోని చైతన్య పాఠశాలలో తన కుమార్తెను చేర్పించేందుకు రెండ్రోజుల కిందట వెళ్లిన ఆయన వడదెబ్బకు గురయ్యాడన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సూర్యనారాయణ వెంటనే గాంధీనగర్‌ చేరుకున్నారు. శ్రీనివాసులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.  పూలమాలలువేసి నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు