లారీని ఢీకొట్టిన కారు : ఒకరి మృతి

9 Sep, 2016 09:27 IST|Sakshi

నార్కెట్‌పల్లి(నల్లగొండ): వేగంగా వెళ్తున్న కారు, లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి శివారులోని 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది.

అతి వేగంతో వెళ్తున్న కారు, లారీని ఢీకొట్టడంతో కారులో ఉన్న ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునజ్జయింది.

మరిన్ని వార్తలు