సోదరుడిని చంపేందుకు సుపారీ..

26 Jul, 2017 18:35 IST|Sakshi

బూర్గంపాడు(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): డబ్బుల కోసం సొంత అన్ననే హతమార్చేందుకు సుపారీ ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు బూర్గంపహాడ్ మండలం సారపాకకు చెందిన ఐటీసీ కాంట్రాక్టర్ యేసు బాబుగా గుర్తించారు. సోదరుడిని చంపించేందుకు కిరాయి ముఠాతో అతడు రూ.పది లక్షల ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఈ విషయం బయటకు పొక్కడంతో ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించారు. పోలవరం ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం కింద పెద్దమొత్తంలో డబ్బులు వచ్చాయి. ఈ డబ్బులను తాను నొక్కేసేందుకు ప్రయత్నించి ఇప్పుడు కటకటాలపాలయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు