డీసీఎంలు ఢీ..ఒకరు మృతి

6 Oct, 2016 09:18 IST|Sakshi

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం కడుకుంట్ల స్టేజీ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం వేకువజామున జాతీయ రహదారిపై రెండు డీసీఎంలు ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ఘటనలో ఒక డీసీఎం క్లీనర్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన చంద్రశేఖర్(30) చనిపోయాడు. గాయపడిన మరో ఇద్దరిని 108లో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 

మరిన్ని వార్తలు