బొలెరో వాహనం ఢీకొని మరొకరు..

11 Aug, 2016 00:35 IST|Sakshi
 
కోల్‌బెల్ట్‌ : భూపాలపల్లి మండల కేంద్రానికి సమీపంలోని హెచ్‌ పీ పెట్రోల్‌ పంపు సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. భూపాలపల్లి ఎస్సై గణపతి నరేష్‌ కథనం ప్రకారం.. గణపురం మండలం కర్కపల్లి గ్రామానికి చెందిన గాదె కనకయ్య(60) ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి వస్తున్న క్రమంలో హెచ్‌పీ పెట్రోలు పంపు సమీపంలో వెనుక నుంచి వచ్చిన బొలోరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో కనకయ్య గాయపడగా వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్‌ తెలిపారు. 
మరిన్ని వార్తలు