పొనకల్(దుగ్గొండి): ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పొనకల్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్మెట సురేష్(34) శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఉక్కపోత ఎక్కువ కావడంతో టేబుల్ ఫ్యాన్ ఆన్ చేయబోయాడు. ఈక్రమంలో దెబ్బతిన్న విద్యుత్ తీగకు చేయి తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతన్ని వెంటనే ఎంజీఎంకు తరలించగా, చికిత్సపొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడికి భార్య రేణుక, ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతుడి సోదరుడు నర్మెట అయిలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రఫాయిల్ తెలిపారు.